Breaking News

రేసులోకి గెల్లు శ్రీనివాస్​ యాదవ్​

రేసులోకి గెల్లు శ్రీనివాస్​ యాదవ్​

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్​ కొనసాగుతోంది. ప్రముఖంగా ఇద్దరి మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇప్పటికే 8 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్​లో బీజేపీ 4,044 (31,027), టీఆర్ఎస్ 3,792 (27,589) ఓట్లు సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​కు 3,438 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ​అయితే ఉన్నట్టుండి 8వ రౌండ్​లో టీఆర్ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​ దూసుకొచ్చారు. 8వ రౌండ్ లో 162 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో ఈటలకు మెజార్టీ కాస్త తగ్గినట్లయింది.