సారథి, పెద్దశంకరంపేట: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అనేక రకరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సినీనటుడు సోనుసూద్ పేదల పాలిటదేవుడిగా మారాడు. ఆయనపై ఉన్న అభిమానంతో పెద్దశంకరంపేటకు చెందిన శ్రీనివాస్ చారి చింతగింజలపై అతని బొమ్మ వేసి అభిమానం చాటుకున్నాడు. కొవిడ్ లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజలకు సొంత డబ్బుతో సేవలు అందించి దేవుడిలా నిలిచాడని కొనియాడారు. గతేడాది కరోనా మహమ్మారితో ఇబ్బందిపడుతున్న సమయంలో నేనుసైతం అంటూ ప్రజల ముందుకొచ్చి సోనుసూద్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఆపదలో ఆదుకున్నవారే రియల్ హీరో అని కొనియాడారు.
- May 26, 2021
- Archive
- Top News
- యువలోకం
- లోకల్ న్యూస్
- SONUSOOD
- పెద్దశంకరంపేట
- బాలీవుడ్
- సోనుసూద్
- స్వర్ణకారుడు
- Comments Off on చింతగింజపై సోనుసూద్ చిత్రం