Breaking News

పథకాలు పేదలకు అందాలి

పథకాలు పేదలకు అందాలి
  • ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

సామాజిక సారథి, బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయా? లేదా? అని పలువురిని అడిగి తెలుసుకున్నారు . ముఖ్యంగా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అందజేసే ఆసరా పింఛన్ వృద్ధులకు వరంగా మారిందని, కుటుంబంలో వృద్ధులకు వచ్చే ఆసరా పింఛన్లు ప్రభుత్వం నుంచి తీసుకునే రూ.రెండువేలు వారి మందుల కోసం ఉపయోగపడుతున్నాయని అన్నారు. వారు ఎవరిమీద ఆధారపడకుండా జీవిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో సీసీరోడ్లు, వీధిలైట్లు, మురుగునీరు తొలగింపు వాటిపై అధికారులు శ్రద్ధ వహించాలని అధికారులకు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ సుదర్శన్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్ రెడ్డి, ఎంపీటీసీ ఉషన్న, నాయకులు రాజేష్ తదితరులు ఉన్నారు.