Breaking News

సర్పంచి భర్త భూకబ్జా

సర్పంచి భర్త భూకబ్జా
  • రోడ్డుపై బైఠాయించి, ప్లకార్డులతో బాధితుల ఆందోళన  

సామాజికసారథి, రామడుగు: తమ భూమిని సర్పంచ్ భర్త ఇతరులు కలిసి భూకబ్జా చేశారని ప్లకార్డులతో బాధితులు రోడ్డుపై ఆందోళన చేశారు. రామడుగు మండలంలోని రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సాదు మనమ్మకు ఇద్దరు కుమారులున్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నారు. ఇదే అదనుగా భావించినా రంగసాయి పల్లె సర్పంచి సాదు పద్మ భర్త మునీందర్ తో పాటు మరికొంత కలిసి మాకున్న 10గుంటల  భూమిని కబ్జా చేసిండ్రని బాధితులు ఆరోపించారు. కబ్జా చేసిన భూమిలో రోడ్డు వేసి, రేకులషెడ్డు నిర్మించారని బాధితులు వాపోతున్నారు. సర్పంచి భర్త ఆగడాలు అరికట్టి, కబ్జా చేసిన భూమిని అప్పగించాలని సోమవారం గ్రామంలోని బాధిత కుటుంబ సభ్యులు సుగుణమ్మ ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న రామడుగు ఎస్సై వివేక్ బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.