![ఆర్టీసీ బస్సులో సజ్జనార్ ఫ్యామిలీ సందడి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/29HSB8.jpg?fit=1280%2C618&ssl=1)
సామాజిక సారథి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకున్నారు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువచేసేందుకు అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు సందర్భాల్లో ఓ సాధారణ ప్రయాణికుడిలా స్వయంగా ప్రయాణించారు. తాజాగా ఆయన తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సపరివార కుటుంబ సమేతంగా బస్సులో సందడి చేశారు. టీఎస్ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వరించేలా రూపొందించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోను సాయితేజ అనే సామాజిక కార్యకర్త ట్విటర్లో పోస్ట్ చేయగా.. దాన్ని సజ్జనార్ రీట్వీట్ చేశారు.