![బాధిత కుటుంబానికి సాయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2023/01/3.jpg?fit=986%2C893&ssl=1)
సామాజికసారథి, రామకృష్ణాపూర్: మందమర్రి మండల బొక్కలగుట్ట గ్రామానికి చెందిన గజ్జి రజలింగు ప్రమాదానికి గురై ఒక సంవత్సరం నుంచి మంచానికే పరిమితం అయ్యారు. విషయం తెలుసుకున్న నెన్నెల కొవిడ్ వాలంటరీస్ వ్యవస్థాపకుడు, సొపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఉపాధ్యాయుడు జలంపెల్లి శ్రీనివాస్ దాతల సహకారంతో సేకరించిన రూ.5500ను బాధిత కుటుంబానికి గురువారం అందించారు.