Breaking News

సీసీ కెమెరాలకు రూ.లక్ష విరాళం

సీసీ కెమెరాలకు రూ.లక్ష విరాళం

సామాజికసారథి, వెల్దండ: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు టీఆర్ఎస్ వెల్దండ మండలాధ్యక్షుడు, సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణతో మంగళవారం స్థానిక పోలీస్​స్టేషన్​లో సీఐ రామకృష్ణ, ఎస్సై నర్సింహులుకు రూ.లక్ష నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే సీసీ కెమెరాలతో గుర్తించవచ్చని, ఒక్క సీసీకెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీఐ రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం విరాళం అందజేసిన వారిని అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్సై కుమారస్వామి, సమీర్ మహ్మద్ షేక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.