Breaking News

రేవంత్​రెడ్డికే టీపీసీసీ పగ్గాలు

రేవంత్​రెడ్డికే పీసీసీ పగ్గాలు

సారథి, హైదరాబాద్: ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడింది. అందరి అంచనాలు నిజమే అయ్యాయి. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్​సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ఉత్తర్వులు జారీచేశారు. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పదిమందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించారు. వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహేష్‌గౌడ్‌, గీతారెడ్డి, అజారుద్దీన్‌, అంజన్‌కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్లుగా చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, కొల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్, కుమార్‌రావు, జావెద్‌ అమీర్‌, గోపిశెట్టి నిరంజన్‌, పోదెం వీరయ్య, సురేష్‌ షెట్కర్‌, ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీ‌, కన్వీనర్‌గా అజ్మతుల్లా హుస్సేన్‌, ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహను నియమించారు.

ఏఐసీసీ విడుదల చేసిన లేఖ