![సామాజిక సేవకు గుర్తింపు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/vjd1.jpg?fit=250%2C228&ssl=1)
సారథి న్యూస్, ములుగు: తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కు అరుదైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్కు చెందిన ఇంద్రోజిర రమేష్ అనే యువకుడు మంగళవారం ఆమె ఫొటోలతో కూడిన జ్ఞాపికను అందజేశాడు. తస్లీమా రైతు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సెలవు రోజుల్లోనూ వ్యవసాయ పనులు చేస్తూ.. నిరుపేదలకు చేయూతనందిస్తూ.. అనాథలు, అభాగ్యుల ఆకలి తీరుస్తుంటారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రమేష్ ఆమె ఫొటోల ఫ్రేమ్ను అందజేసి అభిమానం చాటుకున్నాడు. పేదలకు సహాయం చేయాలనే తపన తనకు ఉన్నా చేయలేకపోతున్నానని.. నలుగురికి సాయం చేసే గుణం గొప్పదని కొనియాడారు. సామాజిక సేవ చేస్తున్న పలువురికి తాను ఫొటోఫ్రేమ్లు అందిస్తున్నట్లు తెలిపాడు.