Breaking News

‘పుష్ప’ మళ్లీ మారేడుమిల్లికి..

‘పుష్ప’ మళ్లీ మారేడుమిల్లికి..

స్టార్ హీరోల సోషల్ మీడియా రికార్డుల్లో ఎక్కువ క్రేజ్‌ బన్నీకే ఉంది. సౌత్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ సంఖ్య 13 మిలియన్ ను క్రాస్ చేసింది. మరోవైపు ‘పుష్ప’ టీమ్ చేస్తున్న ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ యేడు ప్రారంభంలో మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో కొంత భాగం షూట్ చేసిన తర్వాత మరికొంత షూట్‌ హైదరాబాద్‌లో చేశారు. అక్కడి షెడ్యూల్ కంప్లీట్ అవడంతో తిరిగి మారేడుమిల్లిలో ఫినిష్‌ చేయాల్సిన షూట్‌ కోసం అక్కడి చేరుకుంది టీమ్. సెప్టెంబర్​2 నుంచి మారేడుమిల్లి ఫారెస్ట్ తో మళ్లీ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలాఖరుకి షూటింగ్ పూర్తిచేసి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. బన్నీకి జంటగా రష్మిక మందాన్న నటిస్తోంది. విలన్ గా పహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.