Breaking News

స్కూళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు

స్కూళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఫిబ్రవరి 1 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూలును సందర్శించారు. విద్యార్థులు, టీచర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్​గేరుగంటి అనూష, సెక్రటరీ అంజయ్య, పాఠశాల చైర్మన్ కొమ్మట బాగులు, హెచ్ఎం శ్రీనివాస్, టీచర్లు విజయ్ కుమార్, విజయ్ కృష్ణ, శ్రీశైలం, వినయ్, కవిత, రాధిక ఉన్నారు.