Breaking News

మొక్కలే కదా.. అనుకున్నారేమో!

300 హరితహారం మొక్కల తొలగింపు

సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్​ రోడ్డు దుర్గామాత ఆలయానికి వెళ్లే పక్కన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహరంలో మొక్కలను నాటారు. గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రతిరోజూ నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి సమీప స్థలంలో పెట్రోల్​ బంక్​ పనులు, మట్టి లెవలింగ్​ పనులు కొనసాగుతున్నాయి. అక్కడికి వెళ్లేందుకు అడ్డొస్తున్నాయని ప్రభుత్వ స్థలంలో మూడు వరుసల్లో ఉన్న 300 హరితహారం మొక్కలను తొలగించి మట్టితో చదునుచేశారు.