Breaking News

పల్లెప్రగతి షురూ

పల్లెప్రగతి షురూ

సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమం కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల వ్యాప్తంగా గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో నాయకులు, ప్రత్యేకాధికారులు పాల్గొని మొక్కలు నాటి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. కొరటపల్లి గ్రామంలో ప్రత్యేకాధికారి మౌనిక ఆధ్వర్యంలో ఎంపీపీ కల్గెటి కవిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్దేశించిన ప్రకారం మొక్కలు నాటాలని, పాడుబడిన ఇండ్లను పూడ్చివేయాలని, శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు. ప్రతిఇంటిలో ఆరు మొక్కలు నాటాలని ఎంపీపీ పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.