Breaking News

సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు

నటుడు సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు
  • యాక్సిండెంట్‌కు సంబంధించి వివరాలు కోరిన పోలీసులు

సామాజికసారథి, హైదరాబాద్‌: సినీ హీరోసాయి ధరమ్‌ తేజ్‌ గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్‌తేజ్‌.. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తేజ్‌ యాక్సిడెంట్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సాయి ధరమ్‌తేజ్‌పై ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయనున్నట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ తెలిపారు. కమిషనర్‌ స్టీఫెన్‌ రవింద్ర బైక్‌ యాక్సిడెంట్‌ విషయమై పలు కీలక విషయాలను వెల్లడిరచారు. సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ విషయమై కేసు నమోదు చేశామని తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకున్నాక నోటీసులు ఇచ్చామని తెలిపారు. నోటీసుల్లో భాగంగా లైసెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, ఆర్​సీ, ఇన్సురెన్స్‌ వంటి డ్యాక్యుమెంట్లను సబ్మిట్​చేయాలని కోరామన్నారు. అయితే సాయ్‌ ధరమ్‌ తేజ్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలిపారు. తేజ్‌ నుంచి స్పందనరాని కారణంగా అతనిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నట్లు వెల్లడిరచారు.