![తెలంగాణలో లాక్డౌన్ ఉండదు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/cm-5f-1.jpg?fit=677%2C386&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల మూసివేత తాత్కాలికమేనని, విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలు బలమైన సలహాలు, సూచనలు ఇవ్వడం లేదన్నారు. ప్రతి విషయాన్ని విమర్శించడం సరికాదని, మూస ధోరణిలో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని హితవుపలికారు. రాష్ట్రాల హక్కులు, బాధ్యతను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని సీఎం కేసీఆర్మండిపడ్డారు.