Breaking News

మల్చింగ్ సాగు.. బాగు

మల్చింగ్ సాగు.. బాగు

సారథి న్యూస్, రామాయంపేట: మల్చింగ్ పద్ధతుల్లో కూరగాయలను పండించడం ద్వారా ఎక్కువ లాభాలను సాధించవచ్చని మెదక్ జిల్లా డి ఏ ఓ పరుశురాం నాయక్ అన్నారు. కలుపు నియంత్రణలో ఉండి మొక్కకు కావాల్సిన ఎరువులు సమపాళ్లలో అందుతాయని వివరించారు. శుక్రవారం ఆయన మండలంలోని రాజాక్​పల్లి గ్రామంలో మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న కనుకరాజు అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సూచనలు, సలహాలు ఇచ్చారు.