![నిధులు కేటాయించాలని ఎంపీటీసీల నిరసన](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/cpd3.jpg?fit=655%2C303&ssl=1)
సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో తమకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఎంపీటీసీ సభ్యులు నిరసన చేపట్టారు. గెలిచి రెండేళ్లు గడిచినా కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ల మాదిరిగానే ఎంపీటీసీలు కూడా ప్రత్యేక్షంగా ప్రజల చేత ఎన్నుకున్నారని గుర్తుచేశారు. వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి మరుగునపడిందని వాపోయారు. ఈ విషయమై రాష్ట్రస్థాయిలో ఎంపీటీసీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవెళ్లి నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బొమ్మరవేని తిరుమల, గుర్రం దేవిక, ఎడవెల్లి కరుణశ్రీ, కొత్త పద్మ, కనకం జయ, మడ్డి శ్యాంసుందర్, వంచ మహేందర్ రెడ్డి, జవ్వాజి హరీశ్పాల్గొన్నారు.