Breaking News

చిరు నిర్ణయాన్ని స్వాగతించిన ఎంపీ విజయసాయిరెడ్డి

సామాజికసారథి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వైజాగ్లో ఇంటిని కట్టుకుని ఉంటానన్న వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎంపీ విజసాయిరెడ్డి సోమవారం స్వాగతించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి స్థిరపడాలను కోవడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటు న్నాను’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కాగా విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆ మధ్య టాలీవుడ్ హీరోలను కోరిన విషయం తెలిసిందే. అందుకోసం స్థలాలు కూడా ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈనేపథ్యంలో చిరు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మెగాస్టార్ వ్యాఖ్యల పట్ల వైఎస్సా ర్సీపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.