![ఈటలపై కోమటిరెడ్డి సంచనల వ్యాఖ్యలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/nlg.jpg?fit=850%2C500&ssl=1)
సామాజిక సారథి, నల్లగొండ: హుజురాబాద్ ఫలితాలు ఉత్కంఠ లేపుతున్నాయి. రిజల్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ 30వేల మెజార్టీతో గెలవబోతున్నాడు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.ఐదువేల కోట్లు ఖర్చు చేసింది. హుజురాబాద్ ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇవ్వబోతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టలు ఈటల రాజేందర్ గెలుపును చూడకతప్పదు.’ అని వ్యాఖ్యానించారు.