Breaking News

ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం

సారథి న్యూస్​, యాచారం: బీఫ్​ తినేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టబొమ్మను ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో దహనం చేశారు. కేవీపీఎస్​ పిలుపుమేరకు కొత్తపల్లి గ్రామంలో భారీ ర్యాలీ తీసి రాజాసింగ్ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్​ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కావలి జగన్, ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గోరెటి రమేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిక్కుడు గుండాలు, ఎమ్మార్పీఎస్ గ్రామాధ్యక్షుడు కంబాలపల్లి జంగయ్య, టీఆర్ఎస్ యువజన సంఘం నాయకులు పోలే శివ, కేవీపీఎస్​ గ్రామ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు జంగయ్య, దశరథ, కృష్ణకుమార్, శివశంకర్, శివఎల్లయ్య, బుచ్చయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.