Breaking News

 ఎమ్మెల్యే నన్నపనేని బహిరంగ క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్యే నన్నపనేని బహిరంగ క్షమాపణ చెప్పాలి

 సామాజిక సారథి, భూదాన్ పోచంపల్లి: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి పోచంపల్లి మండల కేంద్రంలో బుధవారం అఖిలపక్షం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా నేతన్నలు మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉందని, చెప్పుకునే ఆ పార్టీ నాయకులు నేతన్నలు ఆరాధ్యధైవంగా కొలుచుకునే మగ్గంపై ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కాలుపెట్టి, చేనేత వృత్తినే అవమానించారని ఆరోపించారు. నరేందర్ ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పద్మశాలిలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పోచంపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి, ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తడక రమేష్,  9వ వార్డు కౌన్సిలర్ భోగ, భానుమతి విష్ణు, భారత లవ్ కుమార్, ఎలే శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర చేనేత సమైక్య అధ్యక్షుడు చింతపల్లి రమేష్, అంకం మురళి, ముసునూరు యాదగిరి, భోగ స్వామి, పద్మశాలి యువకులు పాల్గొన్నారు.