Breaking News

యాదగిరీశుడికి ఎమ్మెల్యే మర్రి ‘బంగారు’ కానుక

యాదగిరీశుడికి ఎమ్మెల్యే మర్రి ‘బంగారు’ కానుక

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణం తాపడానికి నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి రెండు కేజీల బంగారాన్ని శుక్రవారం ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. తెలంగాణ కళావైభవం చాటేలా, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ముందుకొచ్చి.. తాజాగా రెండు కేజీల బంగారాన్ని అందజేశారు. నారసింహుడి ఆలయాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి కుటుంబసమేతంగా సందర్శించారు. దేవాలయం పున:నిర్మాణంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని, అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే మర్రి కుటుంబసభ్యులు