![టీఆర్ఎస్ప్రభుత్వానికి అండగా ఉందాం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/mnpd22.jpg?fit=655%2C305&ssl=1)
- జడ్పీటీసీ కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ
- 50 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
సారథి, వడ్డేపల్లి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్వీఎం అబ్రహం ఆదేశాల మేరకు శుక్రవారం వడ్డేపల్లి తహసీల్దార్ ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ, మున్సిపల్ చైర్మన్ కరుణమ్మ 50 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. రామాపురం, జిల్లేడుదిన్నె, కొవెలదిన్నె, బుడమరసు, జులకల్, గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన రూ.5,105,916 విలువైన చెక్కులను అందజేశారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/mnpd-3.jpeg?resize=640%2C320&ssl=1)
జడ్పీటీసీ, ఎంపీపీ మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఎవరూ ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని కొనియాడారు. మనమంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్ఐ మద్దిలేటి, ఎంపీటీసీ గిడ్డెన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ కళావతి మహారాజ్, సర్పంచ్ లు తిమ్మప్ప, పుల్లారెడ్డి, ఇమ్మానేయులు, ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యుడు మణిరాజు, అడ్హాక్ కమిటీ సభ్యుడు నరేంద్ర, ప్రకాష్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు.