Breaking News

కేసీఆర్ ను గద్దెదించుదాం

కేసీఆర్ ను గద్దెదించుదాం

సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్​ను గద్దె దించేందుకు నిరుద్యోగ యువత, విద్యార్థులు కలసి రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్‌లోనే ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని ఎద్దేవాచేశారు. ఎంతోమంది ఆఫీసర్లు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి చరిత్రను చూడండి అంటూ అధికారులపై ఈటల మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఓ పిరికి పంద.. రైతు వేదికలను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. రైతాంగం, పేదల ఊసురు కేసీఆర్‌కు తగులుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌షాకు ఢిల్లీలో దండం పెట్టి ఇక్కడకు వచ్చి పులిలా మాట్లాడుతావ్‌.. ప్రగతిభవన్‌ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను తీసివేసి ప్రజలతో మాట్లాడు అని హితవుపలికార. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, ఆయన ఫ్యామిలీపై బీజేపీ నేత విజయశాంతి మరోసారి ఫైర్‌ అయ్యారు. సీఎం పనిచేయరు.. కానీ జీతం తీసుకుంటారు.. సీఎం ఫ్యామిలీ మొత్తం జీతాలు తీసుకుంటుందని విమర్శించారు. ఇక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఈ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కోరిన రాములమ్మ ఈ ప్రభుత్వాన్ని కూలదూసే సత్తా యువతకు ఉందన్నారు.