![అపోహలు వీడి.. వ్యాక్సిన్ తీసుకోండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/cpd1f.jpg?fit=655%2C285&ssl=1)
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో నివారణకు కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామపంచాయతీ పాలకవర్గం కొద్దిరోజులుగా సెల్ఫ్ లాక్ డౌన్ విధించింది. అందులో భాగంగానే బుధవారం గ్రామంలోని ప్రధాన చౌరస్తాలతో పాటు వార్డుల్లో సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఎంపీటీసీ బొమ్మరవేని తిరుమల, పాలకవర్గ సిబ్బందితో కలిసి హైపో ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వీడి మే1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వేసుకోవాలని సూచించారు. ఉపసర్పంచ్ వడ్లూరి రాజేందర్, వార్డు సభ్యులు నీలం రవి, ఒగ్గరి రాజు, జవ్వాజి కాంతయ్య, ఇతర వార్డు సభ్యులు కార్యదర్శి మధుసూదన్, పంజల జగన్ మోహన్, బొమ్మరవేని తిరుపతి, ఆరిఫ్, జట్టుపల్లి అనిల్ పాల్గొన్నారు.