![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-13-at-8.02.49-AM.jpeg?fit=1600%2C719&ssl=1)
…. ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగీ విజయ్
సామాజిక సారధి , బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించిన ఘనత కెసిఆర్ కే దక్కిందని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ అన్నారు . శుక్రవారం మండల కేంద్రంలోని బిజినాపల్లిలో యాదవుల సోదరులు తయారుచేసిన గొంగళ్లను వారు పరిశీలించారు . బీసీలలో అత్యధిక జనాభా గల కురువ యాదవుల సోదరులకు ఉచిత గొర్ల పంపిణీ తో పాటు వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు .