Breaking News

తహసీల్దార్​కు సమాచార కమిషనర్​ నోటీసులు

తహసీల్దార్​కు సమాచార కమిషనర్​ నోటీసులు

సారథి, బిజినేపల్లి: సమాచార హక్కు చట్టం కింద సకాలంలో దరఖాస్తుదారుడికి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి తహసీల్దార్​కు ఆర్టీఐ కమిషనర్ ​బుధవారం షోకాజ్ ​నోటీసులు జారీచేశారు. బిజినేపల్లి మండలం వడ్డేమాన్ ​గ్రామంలో 2012లో ఎంత మంది రైతులు ఖరీఫ్​ సీజన్​లో బీమా చెల్లించారో తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని న్యాయవాది ఏసీబీ శ్రీరామ్​ఆర్యా బిజినేపల్లి తహసీల్దార్​కు దరఖాస్తు చేశారు. సమాచారం ఇవ్వకపోవడంతో నాగర్​కర్నూల్ ​ఆర్డీవోకు అప్పీల్​చేశారు. అయినా కూడా జిల్లా అధికారుల నుంచి సరైన సమాచారం, సమాధానం రాకపోవడంతో నేరుగా ఆయన రాష్ట్ర సమాచార కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఈ విషయమై తాజాగా బిజినేపల్లి తహసీల్దార్​కు నోటీసులు ఇచ్చారు. ఎందుకు జరిమానా విధించకూడదో సమాధానం చెప్పాలని సంబంధిత అధికారులను కమిషనర్​ ఆదేశించారు. దరఖాస్తుదారుడు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.