Breaking News

రౌండ్..​ రౌండ్​.. టెన్షన్​.. టెన్సన్​

రౌండ్..​ రౌండ్​.. టెన్షన్​.. టెన్సన్​

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్​ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. టీఆర్ఎస్​ శిబిరంలో టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. 8, 9, 10వ రౌండ్లు వీణవంక, 10, 11, 12,13,14,15 రౌండ్లు జమ్మికుంట, 16వ రౌండ్​లో జమ్మికుంటతో పాటు ఇల్లందుల, 17,18వ రౌండ్లు ఇల్లందుల, కమలాపూర్​, 19, 20, 21,22వ రౌండ్లలో కమలాపూర్ ఓట్లను ఎన్నిక కౌంటింగ్​ అధికారులు లెక్కించనున్నారు. ఇప్పటికే 7 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ ప్రస్తుతం ఆధిక్యం కొనసాగిస్తున్నారు. 7 రౌండ్​లో బీజేపీ 4044 (31,027), టీఆర్ఎస్ 3792 (27,589) ఓటు సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​కు 3438 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ​