![ధాన్యం కొనుగోలు చేయాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/23HSB04.jpg?fit=863%2C472&ssl=1)
సామాజిక సారథి, పెద్దశంకరంపేట: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రైస్ మిల్లర్లను కోరారు. మండల కేంద్రంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం వడ్ల నిల్వలు పెరిగిపోవడంతో పాటు రాష్ట్రంలో తుఫాన్ ఉందని వాతావరణ శాఖ చేబుతుందన్నారు. ఆకాల వర్షాలు రాకముందే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మిలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మురళి పంతులు, రైతు సమితి మండల అధ్యక్షులు సురేశ్ గౌడ్, రైస్ మిల్లర్ల అసోసియోషన్ సభ్యులు కందుకూరి రవి, ఎర్రం రమేశ్, పాపిశెట్టి సంతోష్, నాయకులు సుభాష్ గౌడ్ పాల్గొన్నారు.