Breaking News

బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు

బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు

  • తల్లిదండ్రులకు తెలియకుండా బాలుడి మతమార్పిడి
  • ఓ ఇమామ్​ దుర్మార్గం.. ఆందోళనలో తల్లిదండ్రులు
  • నాగర్​కర్నూల్​ జిల్లా ఖానాపూర్​లో వెలుగులోకి..

సామాజిక సారథి, బిజినేపల్లి: కనిపెంచిన తల్లిదండ్రులకు తెలియకుండా హిందూమతం నుంచి ఓ యువకుడిని మాయమాటలు చెప్పి ఇస్లాం మతంలోకి మార్చారు. పైగా ఆరునెలల నుంచి ఇంటికి రాకుండా చేశారు. చివరికి ఆ యువకుడు వేషం కూడా మార్చారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా నాగర్​కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. నాగర్​కర్నూల్​జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్​గ్రామానికి చెందిన
వెల్కిచర్ల శ్రీనివాసులు కుమారుడైన వెల్కిచర్ల విక్రమ్ నాగర్ కర్నూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. అతడు తన స్నేహితుడైన ఓ ముస్లిం యువకుడి వెంట తిరగడంతో అతడు ఇతనికి మాయమాటలు చెప్పి గంజాయి తదితర వాటికి అలవాటుచేశాడు. ఆ యువకుడికి మాయమాటలు చెప్పి మైనారిటీ తీరకముందే తండ్రి శ్రీనివాసులుకు చెప్పకుండా గతేడాది జూలై 7న మసీదు ఇమామ్​ఎండీ అబ్దుల్ హాకీ వద్ద మతమార్పిడి చేయించారు. దీంతో పాటు హైదరాబాద్​లో లాయర్ సహాయంతో అతని పేరు మార్పు కూడా చేయించాడు. అప్పటి నుంచి ఆ యువకుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు. తల్లిదండ్రులకు అనుమానం తలెత్తడంతో ఇటీవల అతడిని నాగర్​కర్నూల్​కు వెళ్లి చూడగా సదరు యువకుడు పూర్తిగా ముస్లిం మతంలోకి మారిన విషయాన్ని గమనించారు. ఈ ఉదంతంపై బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనారిటీ కూడా తీరకముందే తమ కుమారుడిని ముస్లిం మతంలోకి మార్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వెల్కిచర్ల విక్రమ్ తల్లిదండ్రులు డిమాండ్​చేస్తున్నారు. ఇలా చాలామంది యువకులకు మాయమాటలు చెప్పి ఇలా మార్చడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.