![పంట పొలంలో కరోనా టీకా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/28HSB21.jpg?fit=1143%2C619&ssl=1)
సామజిక సారథి, వాజేడు: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ యమున తెలిపారు. మంగళవారం వాజేడు మండలంలో కరోనా టీకా మానవాళికి రక్షణ అని వాజేడు వైద్య సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి పంట పొలాల్లో కూడా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ ఈశ్వరమ్మ. వైద్య సిబ్బంది శేఖర్. ఛాయాదేవి,ఆశ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు