Breaking News

ఎవర్ గ్రీన్ మెలోడీ..

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్షణ‌మైన పాత్రల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి ద‌ర్శక‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన మూవీ టీజ‌ర్‌, సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ‘ధ‌ర్మ క్షేత్రం’లో ఎవ‌ర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌కి ఇది రీమిక్స్. ఈ పాట‌ను అప్పుడు ఎస్‌.పి.బాల‌సుబ్రమ‌ణ్యం, చిత్రలు పాడగా.. ఇప్పుడు ఈ రీమిక్స్ ను ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్, స‌మీర భ‌ర‌ద్వాజ్ కలసి పాడారు. ఇళ‌య రాజా అందించిన ఈ ట్రాన్సింగ్ ట్యూన్ మ‌న‌ల్ని మ‌రో ప్రపంచ‌లోకి తీసుకెళుతుంది.
శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ ఈ మెలోడి మ్యూజిక్‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంటే.. క‌ళ్యాణ్ రామ్ తన స్టైలిష్ లుక్‌తో ఆక‌ట్టుకున్నారు. బెస్ట్ సాంగ్స్ ప్లే లిస్ట్ లో ఈ రీమిక్స్ సాంగ్ స్థానం ద‌క్కించుకుంటుంద‌న‌టంలో సందేహం లేదు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవ‌రి 10న రిలీజ్ కానుంది.