Breaking News

కరోనా టీకాపై అపోహలు వద్దు

కరోనా టీకాపై అపోహలు వద్దు

సారథి, రాయికల్: కరోనా నివారణకు ప్రతిఒక్కరూ టీకాను వేయించుకోవాలని కరీంనగర్​ జిల్లా ఎంపీడీవో ఇనుముల రమేష్​ కోరారు. శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాను వేయించుకున్నారు. 45 ఏళ్లు నిండిన వారు కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి గాని, కరోనా ర్యాపిడ్ నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలను వైద్యులు తొలగించాలన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆయన వెంట వైద్యాధికారి కృష్ణచైతన్య, హెచ్ఈవో శ్రీనివాస్, సూపర్​ వైజర్ తిరుమల శ్రీధర్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తదితరులు ఉన్నారు.