Breaking News

రైతుల పొట్టగొట్టే ఇండస్ట్రీయల్ పార్క్‌ వద్దు

రైతుల పొట్టగొట్టే ఇండస్ట్రీయల్ పార్క్‌ వద్దు

సామాజిక సారథి, చిట్యాల: పేద రైతుల పొట్ట కొట్టే ఇండస్ట్రీయల్ పార్కు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం రెక్కాడితే గాని డొక్కాడని 400మంది పేదరైతుల భూములు గుంజుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తమకున్న వ్యవసాయ భూమిలో వరి, పత్తి పండుతుందని అదే ఆధారంగా జీవిస్తున్నామని, భూమిని కోల్పోతే తమకు చావే దిక్కని పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.