Breaking News

జంటలను.. మైనర్లను అనుమతించొద్దు

జంటలను.. మైనర్లను అనుమతించొద్దు
  • పబ్బుల్లో తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలి
  • ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

సామాజిక సారథి, హైదరాబాద్‌: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్బులకు జంటలను, మైనర్లను అనుమతించొద్దని హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు పరచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఈ వ్యవహారంలో హైదరాబాద్‌ పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువగానే చర్యలు తీసుకుంటున్నారని అభిప్రాయపడింది. పబ్బుల ఎదుట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించింది. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యత వహించాల్సి ఉంటుందని, 4వ తేదీ ఉదయం వరకూ ఈ అంక్షలు అమలుచేయాలని సూచించింది.    డీజే సౌండ్‌లో 45 డెసిబల్స్‌ మించకుండా చూడాలని కోర్టు ఆదేశించింది.