Breaking News

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో రూ.ఐదులక్షల సీడీపీ నిధులతో నిర్మించనున్న గొల్ల యాదవ కురుమ సంఘం భవనం, రూ.43 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీరప్ప ఆలయం పనులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో దండిగా నిధులు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి లోటు రానివ్వలేదన్నారు. కులసంఘాల భవనాలు, ఆలయాలు, మురికి కాల్వలు, సీసీరోడ్లు, హైమాస్ట్ లైట్లు.. ఇలా గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు ఎక్కడా ఇబ్బంది రాకుండా నిధులు సమకూర్చుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, సర్పంచ్ విద్యాసాగర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.