Breaking News

‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ‘దళితబంధు’’

‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ‘దళితబంధు’’

సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, వీహెచ్​పీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దళిత ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని, పేదలకు డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు కట్టిస్తామని చేసిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మరోసారి కుట్రపూరితంగా దళితబంధు పథకాన్ని తీసుకొస్తున్నారని, గారడీ మాటలను నమ్మకూడదన్నారు. ఈనెల 30వ తేదీలోపు ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​జిల్లా నాయకులు తాండ్రాల తిరుపతి, సుంకపాక దామోదర్ మాదిగ, వీహెచ్​పీ జిల్లా కోకన్వీనర్ తలారి సురేష్, ఎమ్మార్పీఎస్​మండల ఇన్​చార్జ్​ఎడపెల్లి నాగరాజు, ఎదురుగట్ల ఉపసర్పంచ్ లింగంపల్లి జానకి, ఎల్.ముత్తయ్య, హమ్మయ్య, ముక్కుస్వామి, జానీ, పద్మ, మణెమ్మ, చంద్రకళ, లక్ష్మీ పాల్గొన్నారు.