Breaking News

దళితుల భూమిని విడిపించాలి

దళితుల భూమిని విడిపించాలి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని సర్వేనం.363లో ఉన్న దళితుల భూమిని కబ్జాదారులు అక్రమంగా పట్టా చేయించుకుని వారిపైనే అక్రమ కేసులు బనాయించడం దారుణమని కేవీపీఎస్​రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంతటి కాశన్న అన్నారు. గురువారం కేవీపీఎస్ ​ఆధ్వర్యంలో స్థానిక సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 1957లో దళితులకు ఇచ్చిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అక్రమంగా పట్టాలు చేయించుకోవడమే కాకుండా ఆ భూమిలో భవనాలు కూడా నిర్మించారని అన్నారు. కలెక్టర్ స్పందించి సర్వే చేయించి దళితుడైన బైని కాశన్న 5.30 ఎకరాల భూమిని వారి వారసులకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింత సత్తి, సీటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రామయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశోక్, కేవీపీఎస్​ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవమల్ల శ్రీను, శ్రీనివాస్, హుస్సేన్, మల్లయ్య పాల్గొన్నారు.