Breaking News

పిల్లలకు కోవోవాక్స్‌

పిల్లలకు కోవోవాక్స్‌
  • కరోనా నుంచి పిల్లలకు విరుగుడు
  • సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పునావాలా

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్‌ టీకాలు వేయాల్సి ఉంటుందని, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కాదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పునావాలా అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవోవాక్స్‌ టీకా ఆరు నెలల్లో అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతం ట్రయల్స్‌ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేశారు. కోవోవాక్స్‌తో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం మా విధానమన్నారు. కోవోవాక్స్‌ వ్యాక్సిన్‌ స్టాక్‌ భారీగానే ఉందని, డ్రగ్‌ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాత భారత్‌తో పాటు ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయన్నారు.