Breaking News

కల్వకుర్తిలో కసిరెడ్డి.. కందనూలులో రాజేశ్​రెడ్డి

కల్వకుర్తిలో కసిరెడ్డి.. కందనూలులో రాజేశ్​ రెడ్డి

సామాజికసారథి, నాగర్​కర్నూల్​ బ్యూరో: ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు రానే వచ్చింది. 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్​ విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు సంబంధించి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి అందరూ భావించినట్లుగానే ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి కాంగ్రెస్​ టికెట్​ వరించింది. నాగర్​కర్నూల్​ నుంచి మరో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి తనయుడు డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​​రెడ్డికి టికెట్ ను​ ఖరారు చేశారు. కొడంగల్​ నుంచి టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. కొల్లాపూర్​ నుంచి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, అలంపూర్​ ఎస్​ఏ సంపత్​కుమార్​, షాద్​నగర్​ శంకరయ్య, అచ్చంపేటలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్​ సి.వంశీకృష్ణ మరోసారి టికెట్​ ఇచ్చారు. గద్వాలలో సరిత అభ్యర్థిత్వాన్ని ఖరారుచేశారు.

నోట్​: తెలంగాణలో కాంగ్రెస్​ అభ్యర్థుల వివరాలను కింద పేర్కొన్న పేజీలో చూడండి(ఏఐసీసీ అధికారిక విడుదల)