Breaking News

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో కొట్లాట

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో కొట్లాట
  • ఎస్సైకి నిప్పంటుకున్న వైనం
  • రెండువర్గాలుగా విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు

సామాజికసారథి, జోగుళాంబగద్వాల: జిల్లాలోని కేటీదొడ్ది మండలం ఇర్కిచేడులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా గురువారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు రెండువర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకూ వినని ఓ వర్గం వ్యక్తులు అంబేద్కర్‌ విగ్రహానికి నిప్పంటించారు. దీంతో అక్కడే ఉన్న ఎస్సైకి నిప్పంటుకుంది. కాగా ప్రత్యర్థివర్గం వారు వెంటనే స్పందించి అంబేద్కర్‌ విగ్రహానికి అంటుకున్న మంటలను ఆర్పివేశారు. అనంతరం పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పరిస్థితులను చక్కదిద్దారు.