Breaking News

వేములవాడ రాజన్నను దర్శించుకున్న కలెక్టర్

వేములవాడ రాజన్నను దర్శించుకున్న కలెక్టర్

సారథి, వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందింది. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి స్వామి వారి ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో ఆయన మాట్లాడుతూ ఆర్చకులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకొవాలని సూచించారు. ఆయన వెంట ఆలయ స్థానాచారి అప్పాల భీమా శంకర్, ప్రధానార్చకులు నమిలకొండ ఉమేష్ శర్మ, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఎస్పీ ఎఫ్ హెడ్ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.