Breaking News

కలెక్టర్ విరాళం

కలెక్టర్ విరాళం

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని  జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ రీజనల్ అధికారి కెప్టెన్ శ్రీనివాసులు, సిబ్బంది సరస్వతి , మాజీ సైనికులు పోచయ్య, దశరథ్, లక్ష్మీనారాయణ, నర్సింలు, రాములు, సత్తయ్య, రాజేందర్ రెడ్డి, ఎన్ సీసీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు