Breaking News

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు

సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2024-2025 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివేందుకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. 4వ తరగతి పూర్తయిన విద్యార్థులు డిసెంబర్ 18 నుంచి.. 2024 జనవరి 6వ వరకు రూ.100 చెల్లించి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని కోరారు. తేదీ: 11.2.2024న మధ్యాహ్నం 1గంటలకు ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. అందులో పాసైన వారికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. దరఖాస్తు కోసం http://tswreis.ac.in, http://tgcet.cgg.gov.in, http://tgtwgurukulam.telangana.gov.in సందర్శించాలని కోరారు.

ఈ తేదీలను గుర్తించుకోండి
దరఖాస్తులు ప్రారంభం: 2023 డిసెంబర్ 18 తేదీ
దరఖాస్తుల చివరి తేదీ: 2024 జనవరి 6వ తేదీ
పరీక్ష తేదీ: 11.2.2024
సమయం: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గం.వరకు