Breaking News

చదువుతోనే భవిత మార్పు

చదువుతోనే భవిత మార్పు

బీఎస్పీ కల్వకుర్తి ఇన్​చార్జ్ ​కొమ్ము శ్రీనివాస్ యాదవ్

సామాజికసారథి, కడ్తాల్: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరస్వతి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా సాగింది. హైస్కూలు హెచ్ఎం విజయ, ఎల్​ఐసీ రిటైర్డ్​ ఆఫీసర్ ​తౌర్యానాయక్​తమ సొంత ఖర్చులతో ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా ఎంపీపీ కమ్లీ నాయక్, జడ్పీటీసీ దశరథ్​ నాయక్, బీఎస్పీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కొమ్ము శ్రీనివాస్ యాదవ్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్ము శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదల విద్యార్థులకు మరింత నాణ్యమైన అందించాలని కోరారు. చదువుతోనే భవిష్యత్​మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం టెన్త్​క్లాస్​లో 10/10 మార్కులు సాధించిన పవన్​నాయక్ ​తదితర విద్యార్థులను సత్కరించారు. సరస్వతి దేవీ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన హెచ్ఎం విజయ ఫ్యామిలీని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, రంగారెడ్డి డీసీసీబీ డైరెక్టర్ ​వెంకటేశ్​ గుప్తా, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

హెచ్​ఎం దంపతులను సన్మానిస్తున్న నాయకులు