Breaking News

విజయ్​ సరసన బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​

విజయ్​సరసన బాలీవుడ్​స్టార్​హీరోయిన్​

‘అర్జున్​రెడ్డి’, ‘గోత గోవిందం’ వంటి బ్లాక్​బాస్టర్​తో మస్త్​పాపులారిటీ సంపాదించుకున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కత్రినాకైఫ్​ నటించనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా.. విజయ్‌ని ఫాలో అవుతోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ కూడా అందుకు సంకేతమని అనిపిస్తోంది. ‘న్యూ డే.. న్యూ హెయిర్ కట్.. న్యూ ఫిలిమ్’ అంటూ కత్రినాపెట్టిన పోస్ట్ విజయ్ సినిమా గురించే అని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇదిలాఉండగా, ఇప్పటికే ఫుల్​షెడ్యూల్​ తో బిజీ అయిన క్రేజీ స్టార్​విజయ్​ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్​లో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ‘లైగర్’ పూర్తయిన తర్వాత కత్రినాకైఫ్ తో నటించే సినిమా షెడ్యూల్​ప్రారంభమవుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి.