Breaking News

వెల్దండ తహసీల్దార్​కు ఉత్తమ అవార్డు

వెల్దండ తహసీల్దార్​కు ఉత్తమ అవార్డు

సారథి న్యూస్, వెల్దండ: కరోనా విజృంభిస్తుండగా, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అందించిన సేవలకు గాను నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులుకు ఉత్తమ అధికారి అవార్డు దక్కింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్​ డే వేడుకల్లో కలెక్టర్ ​ఎల్.శర్మన్, జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి ​చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, లాక్​డౌన్​ను మండల వ్యాప్తంగా ఆయన పకడ్బందీగా అమలుచేశారు. కరోనా బాధితులను గుర్తించి, వారికి చికిత్స అందించడంలో కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం, కోవిడ్​ 19 వ్యాప్తి చెందకుండా ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ విశేషంగా కృషి చేశారు. ఈ క్రమంలోనే తహసీల్దార్​ జి.సైదులును బెస్ట్​ ఆఫీసర్ గా గుర్తించారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనకు కిందిస్థాయి సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.