![నాటుసారా స్థావరాలపై దాడులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/25HSB16.jpg?fit=1000%2C750&ssl=1)
సామాజిక సారథి, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.