Breaking News

నాటుసారా స్థావరాలపై దాడులు

నాటుసారా స్థావరాలపై దాడులు

సామాజిక సారథి‌, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో  గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో  సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.