Breaking News

పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

న్యూఢిలీ: దేశంలోని అనేక రాష్ట్రాలకూ గవర్నర్లను మార్చేశారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్ బైస్​ ను నియమించారు ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ను సైతం కొత్త గవర్నర్​ ను నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​ ​ను ఏపీ గవర్నర్​ గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు, లద్దాఖ్ ఎల్​జీగా ఉన్న ఆర్​కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్​ ప్రదేశ్ గవర్నర్​ గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రాను ఆయన స్థానంలో నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్​ గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్​, సిక్కిం గవర్నర్​ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్​ గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్​ గులాబ్ చంద్ కటారియా, హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ ​గా శివ్ ప్రతాప్​ ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. మణిపుర్ గవర్నర్​ గా ఉన్న లా గణేశ్​ ను నాగాలాండ్ గవర్నర్​ గా బదిలీచేశారు. బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్​ ​ను మేఘాలయా గవర్నర్​ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. హిమాచల్ గవర్నర్​ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్​ ను బిహార్ గవర్నర్​ గా బదిలీచేశారు.