Breaking News

అభాగ్యులకు అన్నదానం

అభాగ్యులకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయం ముందు రోడ్డు మీద తిరిగే అభాగ్యుల కోసం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు శనివారం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కలిసి రాజరాజేశ్వర దేవస్థానం వారు అన్నదానం చేశారు. వారికి మధ్యాహ్నం, రాత్రి రెండుపూటలా భోజనం పెట్టనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతిర్తపు మాధవి, ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ పర్యవేక్షకులు శ్రీరాములు, కౌన్సిలర్లు, కమిషనర్ పాల్గొన్నారు.